భక్త రామదాసుని చెరసాలలో పెట్టింది అబ్దుల్లాహ్ కుతుబ్షాహ్ కానీ అతన్ని వదిలేసింది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్షాహ్. సినిమాలు, నాటకాలలో రామదాసుని చెరసాలలో పెట్టింది, వదిలేసినది ఒకే కుతుబ్షాహ్గా చూపిస్తారు. రామదాసు మేనమామలు అబుల్ హసన్ కుతుబ్షాహ్ దగ్గర మంత్రులుగా పని చేసారు. రామదాసు చెరసాలకి వెళ్ళిన సమయంలో (1668లో) అబ్దుల్లాహ్ రాజుగా ఉండేవాడు. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్ని ఒప్పించి రామదాసుని విడిపించి ఉంటారు కానీ అబుల్ హసన్ వ్యక్తిగతంగా ఏమంత గొప్పవాడు కాదు. అతను మద్యం తాగుతూ మదవతులతో పడుకునేవాడు. రాజు అనుమతి లేకుండా రాజు గారి డబ్బులతో గుడి కట్టినందుకు అబ్దుల్లాహ్ రామదాసుని చెరసాలలో పెట్టాడు కానీ అతను గుడిలోని నగలని జప్తు చెయ్యలేదు. రాజు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు. అబ్దుల్లాహ్ దయగలవాడు కావడం వల్ల ఆ పని చెయ్యలేదు. రామదాసుని క్షమిస్తే మరి కొంత మంది రాజు గారి డబ్బులు దుర్వినియోగం చేస్తారు కనుక రాజు రామదాసుని చెరసాలలో పెట్టాడు.
ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవడైనా ప్రభుత్వ సొమ్ముతో గుడి కడితే అతన్ని అరెస్ట్ చెయ్యడంతో పాటు అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఒక వ్యక్తి మీద ఎ.సి.బి. కేస్ రెజిస్టర్ అయితే అతని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. అతను కోర్టులో నిర్దోషిగా విడుదల అయితేనే అతని బ్యాంక్ అకౌంట్లు రీఏక్టివేట్ చేస్తారు. గుడి కట్టేంతగా డబ్బులు దుర్వినియోగం చేస్తే ఆస్తి జప్తు చెయ్యడం తప్పకుండా జరుగుతుంది.
హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదని నమ్మేవాళ్ళలో కొంత మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రేప్కి గురైన హిందు స్త్రీకి పెళ్ళి సంబంధం దొరక్కపోవచ్చు కానీ తప్పుడు రేప్ కేస్ పెట్టేవాళ్ళకి ఆ సమస్య రాదు, రేప్ జరగలేదని ఆమె బంధువులకి గానీ ఆమె కులపువాళ్ళకి గానీ తెలిసినట్టైతే.
రాయగడ సబ్-జెయిల్లో నాకు ఒక రేప్ కేస్ నిందితుడు పరిచయమయ్యాడు. అతను ఒక రాజకీయ నాయకుడి కూతురిని ప్రేమించాడు. అతనికి పదెకరాలు భూమి ఉంది, ఆ అమ్మాయికి ఇరవై ఎకరాలు ఉంది. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే వీధి. అతను తన లవర్తో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు అతన్ని పట్టుకుని ఆమె చేత రేప్ కేస్ పెట్టించారని అతను అన్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. వీర్యాన్ని టెస్ట్లకి పంపించారన్నాడు. వీర్యపు మరకలు ఉన్నా బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. అతనిది గౌడ (గోపాళ) కులం. ఆ కులంవాళ్ళ వృత్తి పశువులు మేపడం కానీ ఆ కులంలో 25 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకుంటే ఇతని కంటే ఎక్కువ భూమి ఉన్న సంబంధం దొరుకుతుందని అమ్మాయి తల్లితండ్రుల ప్లాన్ కావచ్చు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్. ఆ కేస్లో బెయిల్ తొందరగా రాదు. అతనికి బెయిల్ వచ్చేలోపు ఆ అమ్మాయిని ఇంకొకడికి ఇచ్చి పెళ్ళి చేసేస్తారు. ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో విలన్ హీరోని రాజద్రోహ అభియోగంలో ఇరికించి, శాతో దీఫ్కి పంపించి, తన చిన్నాన్న కూతురిని పెళ్ళి చేసుకుంటాడు. ఆ నవలలో ఎడ్మండ్ డాంటిస్ పద్నాలుగేళ్ళు చీకటి చెరసాలలో గడుపుతాడు, ఇక్కడ ఈ రేప్ కేస్ నిండితుడు బెయిల్ కోసం పడిగాపులు కాస్తూ రెండుమూడేళ్ళు సబ్-జెయిల్లో ఇన్డీసెంట్ ఫుడ్ తింటాడు. నేను ఐదు రోజులు జైలులో రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ తిన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిందో లేదో నాకు తెలియదు. మా పక్క ఊరిలో ఒకడు 18 ఏళ్ళు దాటిన అమ్మాయిని తీసుకెళ్ళాడు. అతని మీద చిన్న పిల్లలతో సెక్స్ కేస్ పెట్టారు, మూడేళ్ళైనా అతనికి బెయిల్ రాలేదు. ఇలాంటి నిజజీవితపు ఎడ్మండ్ డాంటిస్లు ఎంత మంది ఉన్నారో?
సారా వ్యాపారం చేసేవాడు పోలీసులకి దొరికిపోతే అతను వేరే వ్యాపారం చూసుకుంటాడు. అలాగే వేశ్యలు పోలీసులకి దొరికిపోతే వాళ్ళు వేరే వ్యాపారం చెయ్యలేరా? స్త్రీ జనోద్ధారకులు వేశ్యావృత్తిని చట్టబద్దం చెయ్యాలంటారు కానీ సారా వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. సారా వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే. సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ వేశ్యల్ని ఉద్ధరించడానికి మాత్రం సంఘాలు పుట్టుకొస్తాయి. వేశ్యతో పడుకున్నవాడికి కండోమ్ జారిపోయి గుప్తరోగం అంటితే వాడి చికిత్సకి వీళ్ళు డబ్బులు ఇస్తారా? రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ చేసిన సారా తాగితే మనిషి ఎక్కువ కాలం బతకడు. అమ్మోనియాతో కల్తీ చేసిన సారా తాగితే ఆకలి తగ్గిపోతుంది. గుప్తరోగం అంత తొందరగా తగ్గదు, మూడు సార్లు గుప్తరోగం అంటినవాడు కూడా ఎంత కాలం బతుకుతాడో తెలియదు. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే వేశ్యలతో పడుకున్నవాళ్ళని ఉద్దరించినట్టు కూడా అవ్వదు.
జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని చెప్పి బూటకపు ఎంకౌంటర్లని చట్టబద్దం చెయ్యాలనుకునేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు. పాత కేసులో వాయిదాలకి హాజరు అవ్వలేదని నన్ను ఐదు రోజులు రాయగడ సబ్-జైల్లో పెట్టారు. ఆ జైలులో ఉదయం పూట ఉప్మా, మధ్యాహ్నం & సాయింత్రం అన్నం ఇస్తారు. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్లో కొని వండిన అన్నం అది. రూపాయి బియ్యాన్ని కుక్కలు కూడా తినవు అని మాకు తెలిసిన ఒక రిక్షావాడు అనేవాడు. అదే బియ్యాన్ని జైలు కేంటీన్ కాంట్రాక్టర్లు కొని కైదీలకి వండి పెడతారు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు కొని విద్యార్థులకి పెడతారు. మా నాన్నగారిది రాయగడ జిల్లా శేసిఖల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపలగూడ గ్రామం. ఈ ఊరిలోని లబ్దిదారులు అమ్ముకునే రేషన్ బియ్యాన్ని కొనే స్మగ్లర్లు దాన్ని బరంపురం, భుబనేశ్వర్ జైల్ల కేంటీన్లకి కూడా సప్లై చేస్తారు. ఈ ఊరిలో ఎక్కువ మంది కూలీవాళ్ళు, ఇక్కడ 40 మందికి మాత్రమే సొంత వ్యవసాయ భూమి ఉంది. రూపాయి బియ్యాన్ని కూలీవాడు కూడా తినడు కానీ జైల్ కేంటీన్లో, హాస్టల్ కేంటీన్లో దానితో వండిన అన్నమే దొరుకుతుంది.
జైలులో వండే చేపలు పంది మాంసం కంటే పరిశుభ్రంగా ఉండవు. మనం ఇంటిలో చేపల్ని వాసన పోయేంత వరకు కడుగుతాం. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని అలా కడగడు. చేపలు కడగడానికి లేబర్ టైమ్ ఎక్కువ పడుతుంది. మనం ఇంటిలో చేపల్ని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వండుతాం. జైలు కేంటీం కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలుపుతాడు. కైదీలని తిండి, స్నానం టైమ్లో సెల్ బయటకి వదులుతారు, రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ సెల్ బయటకి వదలరు. పప్పు తినడం చాలా కష్టంగా ఉండడం వల్ల జైలులో రెండు సార్లు నేను అన్నం తినను అని చెప్పాను. సాయింత్రం ఆరు గంటలకే సెల్కి తాళాలు వేసేస్తారు అని చెప్పి వేరే కైదీలు నన్ను అన్నం తినమని బలవంతం చేసారు. రెండు నెలలు జైలులో ఉండిన కైదీకి పప్పు క్వాలిటీ గురించి అడిగితే వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తారని చెప్పాడు.
జైలు కూడు తినడానికి మెంటలోడికి కూడా ఇష్టం ఉండదు. దళితవాడల్లో నివసించేవాళ్ళు కూడా ఆవు మాంసాన్ని రెండు సార్లు కడుగుతారు, చేపల్ని వాసన పోయేంత వరకు కడుగుతారు. దళితవాడలో నివసించేవాడు కూడా వారానికొకసారి మాంసం, చేపలు తినడానికి జైలుకి వెళ్ళాలనుకోడు. బెయిల్ కోసం సరెండర్ అయ్యేవాళ్ళు పచ్చడి సీసాలని తెచ్చుకుని అన్నంలో పచ్చడి కలుపుకుని తింటారు. కొంత మంది కైదీలు కుటుంబ సభ్యుల చేత టిఫిన్, పండ్లు తెప్పించుకుంటారు. బిర్యానీలని మాత్రం జైలులో అనుమతించరు. ఒడిశా జైల్లలో వేసవిలో మాత్రమే చల్లని నీరు ఇస్తారు. బెయిల్ కోసం సరెండర్ అయ్యేవాళ్ళు మినరల్ వాటర్ లేదా కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు. జైలులో కొన్ని గంటలు మాత్రమే మోటర్ ఆన్ చేసి ఉంటుంది. మోటర్ ఆన్లో ఉన్నప్పుడే కైదీలు ఖాళీ బోతల్స్లో నీరు నింపుకుని సెల్స్కి తాళం వేసిన టైమ్లో తాగుతారు. తిండికీ, నీరుకీ బయట ఉన్నంత స్వేచ్ఛ జైలులో ఉండదు. పెద్దపెద్ద హొటెల్వాడే చవక రకం పామాయిల్ని బిర్యానీలో కలుపుతాడు. జైల్ కేంటీన్వాడు అసలు బిర్యానీ వండడు. పశువుల ఎముకలతో కల్తీ చేసిన నూనెతో బిర్యానీ వండినా ఖర్చు ఎక్కువ అవుతుంది. అంత ఖర్చు పెట్టి కైదీలని మేపాలని ఎవడూ అనుకోడు.
ఒక రాజకీయ నాయకుడి పెద్దకర్మ రోజు చేపలు వేపిన నూనెలో వంకాయలు వేపడం నేను కళ్ళతో చూసాను. మతపరమైన కార్యక్రమాల్లో వంటలు చేసేవాళ్ళు అమంగళదాయకమైన ఆహారం వండుతున్నప్పుడు జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ మాత్రం మంగళదాయకమైన కూడు వండుతాడా? మతపరమైన కార్యక్రమాల్లో వంటలు చేసేవాళ్ళు వేస్ట్ నూనెలో వేపిన వంకాయల్ని పెరుగులో కలిపి అవి పెరుగు వంకాయలు అని చెప్పి అతిథులకి పెడతారు. జైల్ కేంటీన్వాడు వేస్ట్ నూనెని డైరెక్ట్గా పప్పులో కలిపేస్తాడు. సబ్-జైల్ కైదీలు బెయిల్ మీద బయటకి వెళ్ళిపోవాలనుకుంటారు తప్ప ఫుడ్ క్వాలిటీ మీద కంప్లెయింట్ ఇవ్వరు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికే కాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. తక్కువ బిల్ క్లెయిం చేసేవాడు చీప్ క్వాలిటీ ఫుడ్నే వండుతాడు కనుక దాని గురించి కంప్లెయింట్ ఇచ్చినా లాభం ఉండదు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని మిస్లీడింగ్ ప్రోపగాండా చెయ్యకూడదు. సమాజం గురించి తెలియని అమాయకుడు అది నిజమని నమ్మేసి ఫ్రీ ఫుడ్ కోసం దొంగతనమో, మానభంగమో చేస్తే వాడికి జైలులో ఇన్డీసెంట్ ఫుడ్ దొరుకుతుంది. కట్నం కోసం మానభంగం జరిగిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాళ్ళు ఉంటారు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్ కనుక మానభంగం చేసినవాడి జీవితమే చెరసాలలో నాశనం అవుతుంది. హత్య, గంజాయి, మానభంగం, చిన్నపిల్లతో సెక్స్ వగైరా ఇవి నాన్ బెయిలెబుల్ కేసులు, రెండు నెలలు జైలులో ఉండిన కైదీ నాకు ఈ విషయం చెప్పాడు.
నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. NDPS అనేది నాన్ బెయిలెబుల్ కేస్ అయినప్పటికీ షారూఖ్ ఖాన్ కొడుక్కి బెయిల్ తొందరగా వచ్చింది. సినిమా హీరో కొడుకు రేప్ చేసినా అతనికి బెయిల్ తొందరగా రాదని గ్యారంటీ ఏమిటి? దిశ రేప్ కేసులోని నిందితులు లారీ డ్రైవర్లు & హెల్పర్లు కాబట్టి వాళ్ళు ఫేక్ ఎంకౌంటర్కి బలి అయ్యారు కానీ చిరంజీవి కొడుకు రేప్ చేస్తే అతన్ని ఫేక్ ఎంకౌంటర్లో చంపాలని డిమాండ్ చేసే ధైర్యం మన సోషల్ మీడియాలోని స్త్రీ జనోద్ధారకులకి ఉండదు. చిరంజీవి గారి తమ్ముడి మీద ఒక అమ్మాయి బైగమీ కేస్ వేస్తే చిరంజీవి గారి అభిమానులే ఆ అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నించారు. చిరంజీవి గారి కొడుకు మీద ఒక అమ్మాయి రేప్ కేస్ పెట్టినా ఇలాగే జరుగుతుంది. కొంత మంది రేపిస్టులకి మరణ శిక్ష విధించాలంటున్నస్రు. రేపిస్టులకి మరణ శిక్ష విధిస్తే స్త్రీకి శీలం ప్రాణంతో సమానం అనే అభిప్రాయం కలుగుతుంది, అప్పుడు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో మూఢనమ్మకాలు పెరుగుతాయి. భర్త చనిపోయిన స్త్రీకి మాసిన చీర కట్టించి ఇంటిలో పని మనిషిగా పెట్టుకునే సాంఘిక దురాచారస్న్ని దాటి ఆమె చేత డాక్టర్ ఉద్యోగమో, టీచర్ ఉద్యోగమో చెయ్యించే స్థితికి వచ్చాం. ఈ స్థితిలో స్త్రీకి శీలం ప్రాణంతో సమానం లాంటి మూఢనమ్మకాలు తెచ్చుకోవడం అవసరమా?
రాయగడ సబ్-జెయిల్లోని కైదీలలో ఎక్కువ మంది దొంగతనం, NDPS, POCSO కేసుల్లో వచ్చినవాళ్ళు. ఇవి నాన్ బెయిలెబుల్ కేసులు కాబట్టి వీళ్ళకి బెయిల్ తొందరగా దొరకదు. హత్య కేసులో జీవిత కారాగార శిక్ష పడుతుంది కాబట్టి ఇక్కడ హత్య కేస్ నిందితులు తక్కువ. 498a కేస్ నిందితుల్లో కొంత మంది తాగుబోతులు. వాళ్ళు రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ చేసిన సారా తాగితే వాళ్ళు ఎప్పటికైనా చస్తారు. రేప్, POCSO, 498a అనేవి జెండర్ సెన్సిటివ్ నేరాల కేసులు. లింగ వివక్షని తగ్గించి ఆ కేసులు తగ్గించడానికి ప్రయత్నించాలి. పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంలాగ అన్నిటికీ ఎంకౌంటర్లు, మరణ శిక్షలు పరిష్కారం కాదు. డబ్బున్నవాడు ఐదు లక్షలు ఎంబెజల్ చేస్తే వదిలేసి ఐదు వేలు దొంగతనం చేసిన పేదవాణ్ణి అరెస్ట్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గదు అని ఒక IPS ఆఫీసరే నాకు చెప్పాడు. డబ్బున్నవాడు మర్డర్ చేసినా సాక్ష్యం మాయం చేసే ఆఫీసర్లు ఉన్నారు మన దేశంలో.
మద్యం తాగిన మత్తులో మానభంగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ తుపాకీతో బెదిరించి మానభంగం చేసిన ఘటనలు తక్కువ. విచిత్రం ఏమిటంటే మద్యం తాగడానికి లైసెన్స్ అవసరం లేదు కానీ తుపాకీ కొనడానికి లైసెన్స్ అవసరం. తుపాకీ కొన్న తరువాత దాన్ని డి.ఎస్.పి.కి చూపించాలి. డి.ఎస్.పి. దాని రంధ్రం డయామీటర్, బారెల్ పొడవు కొలుస్తాడు. ఆ తుపాకీ ఎండార్స్ అవ్వకపోతే దాన్ని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చెయ్యాలి. మద్యం కొనడానికి లైసెన్స్ అవసరం లేదు, అది తాగడానికి ఎండార్స్మెంట్ అవసరం లేదు. ఆ మద్యాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ చేసినా, అమ్మోనియాతో కల్తీ చేసినా ఎవరి ఎండార్స్మెంట్ లేకుండా అది తాగెయ్యవచ్చు. అమ్మోనియాతో కల్తీ చేసిన మద్యం మూడు గ్లాసులు తాగితే నిశా అవుతుంది. బాటెరీ నుంచి తీసిన కెమికల్స్తో కల్తీ చేసిన్స్ మద్యం ఒక్క గ్లాస్ తాగినా నిశా అవుతుంది. ఒడిశా పోలీసులు సారా వ్యాపారుల దగ్గర నెలకి రెండు వేలు చొప్పున మామూళ్ళు వసూలు చేస్తారు. లైసెన్స్ లేని తుపాకులు తయారు చేసేవాళ్ళ దగ్గర మాత్రం అలా మామూళ్ళు తీసుకోరు. తాగుబోతులు పట్టపగకు సారా తాగగలరు కానీ వేటగాళ్ళు రాత్రి పూటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని తిరుగుతుంటారు. తాగిన మత్తులో మానభంగం పోలీస్ ఆఫీసర్ కూడా చెయ్యగలడు. మద్యం తాగడానికి లేని లైసెన్స్ మేండేటరీ తుపాకీ కొనడానికి ఎందుకు పెట్టినట్టు?