మావోయిస్టుల్ని ఏరివెయ్యడానికి ఆధార్ కార్డులు అవసరం అని ప్రభుత్వం చెపుతోంది కానీ మావోయిస్టుల దగ్గర కూడా ఆధార్ కార్డులు ఉంటాయి. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర ఆధార్ కార్డులు లాక్కుని, వాళ్ళ పేరుతో బ్యాంక్లో బేనామీ అకౌంట్లు ఓపెన్ చేసి, రీహేబిలిటేషన్ చెక్కులు డిపాజిట్ చేసే ఆఫీసర్లు ఉన్నారు. ఈ విషయం ఝార్ఖండ్ ప్రభుత్వానికి తెలిసిపోయింది. లొంగిపోయిన తీవ్రవాదులకి కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి రీహేబిలిటేషన్ డబ్బులు ఇస్తామని ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంటే ఓపెన్ అవ్వదు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే చెక్ పని చెయ్యదు. లొంగిపోయిన తీవ్రవాదులకి చెక్కులు ఇస్తున్నారంటే దాని అర్థం తీవ్రవాదులకి కూడా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు ఉన్నట్టే కదా.
ఆధార్ కార్డుల పేరుతో జనాన్ని ఫూల్ చేస్తున్న ప్రభుత్వం
Posted
Author
Administrator
Categories
Meaningless labor